ప్రస్తుత సీజన్ కోసం కేంద్ర ప్రభుత్వం ఆవాల కనీస మద్దతు ధర ప్రతి క్వింటాలు రూ.500 నిర్ధారించింది. హర్యాణాలో పంట అత్యంత సంతృప్తికరంగా ఉండడమే కాకుండా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నందున భారత్లో వంటనూనెల ధరలు పైపైకి ఎగబాకుతున్నాయని వ్యాపారులు పేర్కొన్నారు. ఇప్పట్లో ధరలు దిగివచ్చే అవకాశం కనిపించడంలేదు. తద్వారా ఆవాల సగటు ధర ప్రతి క్వింటాలు రూ. 6500 పలుకుతోంది. ఇది కనీస మద్దతు ధరతో పోలిస్తే 25 శాతం అధికమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని వలన ప్రభుత్వం కొనుగోలు చేపట్టవలసిన అవసరం ఉండదని విశ్లేషిస్తున్నారు.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు