గుంటూరు కోల్డ్ స్టోరేజ్ లలో మిర్చి నిల్వలు తగ్గే అంచనా
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
గుంటూరు మార్కెట్లో దినసరి సగటున 1 లక్ష బస్తాల మిరప రాబడి అవుతోంది. గత వారం 4 రోజుల మార్కెట్లలో 3.80 లక్షల బస్తాల కొత్త మిరప రాబడి కాగా, మిగులు నిల్వలు సహా 4 లక్షల బస్తాల సరుకు అమ్మకం అయింది. ఇందులో తేజ డీలక్స్ రూ. 300, నెంబర్-5, సింజెంట బడిగ, 334, సూపర్-10, అన్ని మీడియం, మీడియం బెస్ట్, తేజ తాలు, మిగతా రకాలతో పాటు ఇతర తాలు రకాలలో రూ. 500, తేజ మీడియం, మీడియం బెస్ట్, ఆర్మూర్, బుల్లెట్ రకాలు రూ. 800, డిడి, 341, 355-బడిగ, బంగారం రకాలు రూ. 1000 మరియు 2043 రకం ధర రూ. 1500 ప్రతి క్వింటాలుకు పెరిగింది. పచ్చళ్ళ తయారీదారుల కోసం పౌడర్ రకాలకు డిమాండ్ పెరుగుతున్నది. అయితే డీలక్స్ రకాల కొరతతో ఎక్కువగా మీడియం, మీడియం బెస్ట్ రకాల సరుకు అమ్మకం అవుతోంది.
గుంటూరు కోల్డ్ స్టోరేజీలలో వారంలో 50 వేల బస్తాల రాబడి కాగా, 45 బస్తాల సరుకు అమ్మకం అయింది. ఇందులో తేజ రూ. 300, 355- బ్యాడిగ రకం రూ. 1000 పెరిగి క్వాలిటీ ప్రకారం కాగా, ఇతర రకాల ధరలు స్థిరంగా ఉన్నాయి. మరియు
గుంటూరు కోల్డ్ స్టోరేజీలలో ఇంతవరకు సుమారు 40-42 లక్షల బస్తాల సరుకు నిల్వ అయినట్లు అంచనా. కాగా వచ్చే నెలలో యార్డుకు వేసవి సెలవులు ప్రకటించే సమయానికి మరో 8 నుండి 10 లక్షల బస్తాల సరుకు నిల్వ అయ్యే అవకాశం ఉంది.
ఖమ్మం కోల్డ్ స్టోరేజీలలో ఇంతవరకు 14.06 లక్షల బస్తాల సరుకు నిల్వ అయింది.
వ్యాపారస్తుల కథనం ప్రకారం నిల్వ పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటే మరియు కర్ణాటకలో రాబడులు తగ్గిన నేపథ్యంలో భవిష్యత్తులో ధరలు పెరిగే సూచన కలదు. ఎందుకనగా గత వారం ఆంధ్ర,తెలంగాణలలో కలిసి సుమారు 8 లక్షల బస్తాల సరుకు రాబడి కాగా, మొత్తం సరుకు అమ్మకం అయింది. గుంటూరు మార్కెట్లో నాణ్యమైన తేజ కొత్త సరుకు రూ. 15,000–18,000, డీలక్స్ రూ. 18,100-18,300, ఎక్స్ ట్రా ఆర్డినరి రూ. 18,400-18,500, బడిగ-355 రూ. 16,000-20,500, డీలక్స్ ఎక్స్ట్రా ఆర్డినరి రూ. 20,600-21,000, సింజెంట బడిగ రూ. 16,000-20,800, డీలక్స్ రూ.20,900-21,000, డిడి రూ. 16,000-20,500, (భద్రాచలం) 341 రూ. 16,000-21,500, డీలక్స్ రూ. 21,600-22,000, దేశీవాలి (341 రకం) రూ. 17,000-22,000, రూ.16,000-25,000, బుల్లెట్ రకం సరుకు రూ. 14,000-17,500, డీలక్స్ రూ. 17,600-18,000, నెంబర్-5 రూ. 16,000-21,500, డీలక్స్ రూ. 21,600-22,000, 334, సూపర్-10 రూ. 14,000-18,500, డీలక్స్ రూ. 18,600-18,800, 4884 రూ. 13,000-16,000, 273 రూ. 15,000-18,500, బంగారం రకం రూ. 14,000–18,000, డీలక్స్ రూ. 18,100-18,200, ఆర్మూర్ రకం రూ. 13,500-16,500, డీలక్స్ రూ. 16,600-16,800, రొమి రూ. 13,500-16,500, డీలక్స్ రూ. 16,600-16,800 మరియు 577 రకం రూ. 14,000–19,000, సీడ్ రకం మీడియం బెస్ట్ రూ. 13,000-15,500, తాలు కాయలు తేజ రూ. 10,000-11,000, డీలక్స్ లాల్కట్ రూ. 11,200-12,000, తాలు కాయలు రూ. 4500-8500, 341, డిడి తాలు కాయలు రూ. 9000-11,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుంటూరు శీతల గిడ్డంగులలో నిల్వ అయిన నాణ్యమైన తేజ రకం రూ. 15,000-18,000, డీలక్స్ రూ. 18,100-18,300, మీడియం బెస్ట్ రూ. 13,500-14,900, బడిగ 355 రకం రూ. 16,000-20,500, డీలక్స్ రూ.20600–21,000, సింజెంట బడిగ రకం రూ. 15,000-19,000, 334, సూపర్ 10 రకం రూ. 14,000-17,500, మీడియం బెస్ట్ రూ. 13,000–13,900 మరియు 341 రకం రూ. 15,000-19,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
తెలంగాణలోని వరంగల్లో గత వారం 1-40 లక్షల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 15,000-18,300, 341 నాణ్యమైన సరుకు రూ. 19,000-23,500, వండర్ హాట్ సరుకు రూ. 20,000-24,500, 1048 రకం రూ. 16,000-18,500, దీపిక నాణ్యమైన సరుకు రూ. 20,000-25,500, 334 రూ. 16,000-18,300, టమాట నాణ్యమైన సరుకు రూ. 45,000-55,000, సింగిల్పట్టి మీడియం బెస్ట్ రూ. 16,000-19,500, నాణ్యమైన సరుకు రూ. 30,000-38,000 తేజ తాలు రూ. 6500-7600, 341 తాలు రూ. 6000-7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ఖమ్మంలో గత వారం 1.30 లక్షల బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 19,050, మీడియం రూ. 18,000–18,500, తాలుకాయలు నాణ్యమైన సరుకు రూ. 10,500 మరియు 5 వేల బస్తాల ఎసి సరుకు తేజ రూ. 18,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
కేసముద్రంలో దినసరి 2000-2500 బస్తాల రాబడిపై తేజ రకం రూ. 15,521-17,021, తాలలు కాయలు రూ. 6000-11,0000, మహబూబాబాద్ లో శుక్రవారం నాడు 14-15 వేల బస్తాల రాబడిపై రూ. 11,000-18,200, తాలు కాయలు రూ. 10,000-10,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
హైదరాబాద్లో గత వారం 15 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 10,000–17,500, బడిగ డబ్బి నాణ్యమైన సరుకు రూ. 30,000, మీడియం రూ. 26,000-27,000, బడిగ రూ. 21,000-27,000, 273 మీడియం బెస్ట్ రూ. 16,000-18,000, నాణ్యమైన సరుకు రూ. 19,000, సూపర్-10 నాణ్యమైన సరుకు రూ. 18,000-19,000, మీడియం రూ. 14,000-17,500 మరియు 341 రకం రూ. 18,000-20,000, సి-5 రూ. 17,000–18,000, డిడి రూ. 17,000-19,000, తాలు కాయలు నాణ్యమైన తేజ రూ. 9000-10,500, మీడియం రూ.5000-8000, హైబ్రిడ్ తాలు రూ. 4000–7500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
కర్ణాటకలోని బ్యాడ్గి లో రాబడులు తగ్గడంతో పాటు, డిమాండ్ పెరిగినందున ధర రూ. 1500-200 వృద్ధిచెంది సోమ, గురువారాలలో కలిసి 30-35 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై డిబ్బి డీలక్స్ రూ.36,000-38,100, నాణ్యమైన డబ్బి రూ.29,000-34,700, కెడిఎల్ డీలక్స్ రూ. 28,500-30,500, నాణ్యమైన సరుకు రూ.24,500-27,000, మీడియం రూ. 10,000–13,500, 2043 డీలక్స్ రూ. 25,000-28,500, 5531 నాణ్యమైన సరుకు రూ. 18,000-19,500, మీడియం రూ. 14,000-16,500, కెడిఎల్ తాలు కాయలు రూ. 26,000-33,000, సీడ్ తాలు కాయలు రూ. 6000-9000 మరియు గురువారం నాడు 1500 బస్తాల ఎసి సరుకు రాబడి కాగా, నాణ్యమైన 2043 రకం మిర్చి రూ. 30,000-30,500, సూపర్-10 రూ. 19,700-21,000, 5531 రకం తాలు కాయలు రూ. 7400-8200, తాలు కాయలు కెడిఎల్ రూ.3300-3700. మరియు సింధనూరులో మంగళవారం నాడు 5 వేల బస్తాల రాబడిపై డబ్బీ మిరప రూ. 34,000, సింజెంట బడిగ రకం రూ. 25,000-29,000, 5531 రకం రూ. 19,000-20,000, జిటి రకం రు 17,000-19,000, తేజ రకం రూ 15,000-18,200 మరియు తాలు రూ.4000-10,000 ధరతో వ్యాపారమెంది.
ఛత్తీస్గఢ్ లోని జగదల్పూర్లో ప్రతి రోజు 1500-2000 బస్తాల సరుకు రాబడి పై తేజ మరియు సన్-గ్రో రూ. 15,000-18,000, 4884 రూ. 14,000-15,000, తాలు కాయలు తేజ రూ. 9000-10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
మధ్య ప్రదేశ్లోని బేడియాలో శనివారం నాడు 8-10 వేల బస్తాల మిర్చి రాబడి కాగా, మహీ రకం ఫుల్కట్ రూ.12,000-15,000, తొడిమెతో సహా రూ. 11,000-14,000, లాల్కట్ రూ. 10,500-11,000, ఫుల్కట్ తాలు కాయలు రూ. 9000–10,000, తొడిమెతో కూడా తాలు రూ. 8000-9000 ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు