వచ్చే నెల నుండి కొత్త యసంగి వేరుశనగ

 


దేశంలో వచ్చే నెల నుండి యాసంగి కొత్త వేరుశనగ రాబడి ప్రారంభమయ్యే అవకాశం కలదు. ప్రభుత్వం నిల్వ పరిమితి విధించడంతో మిల్లర్ల కొనుగోళ్లు తగ్గడంతో పాటు సరఫరా పెరుగుతున్నది. దీనితో ధరలు మందకొడిగా మారుతున్నాయి. లబించిన సమాచారం ప్రకారం తెలంగాణలో ని ఉత్పాదక కేంద్రాలలో సరుకు రాబడులు తగ్గి గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, సూర్యపేట, తిరుమలగిరి, వరంగల్, కేసముద్రం మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి దినసరి కేవలం 20 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ.5500-6900, మబబూబ్నగర్ హెచ్పిఎస్ గింజలు 80-90 కౌంట్చెన్నై డెలివరి రూ. 9321, 70-80 కౌంట్ రూ. 9420, 60-70 కౌంట్ రూ. 9800, 50-60 కౌంట్ రూ. 10,000, హెదరాబాద్ డెలివరి 10,200 ధరతో వ్యాపారమైంది.


కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాలలో గత వారం 2 రోజుల మార్కెట్లో 40-50 వేల బస్తాల కొత్త సరుకు రాబడి అయింది. కళ్యాణ్ దుర్గ్, రాయదుర్గ్, మడకశిర ప్రాంతాలలో గత వారం 30 వేల బస్తాల రాబడి కాగా, రూ. 6000-6800, హెచ్పీఎస్ గింజలు 80-90 చెన్నై డెలివరి రూ. 9300, 70-80 కౌంట్ రూ. 9600, 60-70 కౌంట్ మహారాష్ట్ర డెలివరి రూ. 10,000 మరియు కర్నూలులో వేరుసెనగ నూనె (ప్రతి 10 కిలోలు) రూ. 1520, గింజలు (240 కిలోలు) రూ. 19,500, పిండి రూ. 40,000 ప్రతి టన్ను ధరతో వ్యాపారమైంది. ఎమ్మిగనూరులో నూనె 10 కిలోలు రూ. 1480, కొల్లాపూర్లో రూ. 1490, నరసారావుపేటలో నూనె రూ.1500, హెచ్ఐచ్పిఎస్ గింజలు 70-80 కౌంట్ రూ. 10000, 50-60 కౌంట్ రూ.10500 ధరతో వ్యాపారమయింది.


గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 20-30 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై నాణ్యమైన సరుకు రూ.6000-6500, మీడియం రూ. 5800-6000, హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 9000-9300, 90-100 కౌంట్ రూ. 9000, 60-70 కౌంట్ రూ. 9200-9300, 50-60 కౌంట్ రూ. 9600-9900, 50-55 కౌంట్ రూ. 9900, 40-50 కౌంట్ రూ. 10,200, 40-45 కౌంట్ రూ. 10,350, 38-42 కౌంట్ రూ. 10,500, కొత్త జావా రకం 80-90 కౌంట్ రూ. 9000-9300, 90-100 కౌంట్ రూ. 9100, 60-70 కౌంట్ రూ. 9200-9500, 50-60 కౌంట్ రూ. 9600-9900, రాజ్కోట్లో వేరుశనగ నూనె రూ. 1575, జూనాగఢ్ రూ. 1525, పిండి రూ. 40,000 ధరతో వ్యాపారమైంది.


గత వారం మధ్య ప్రదేశ్లోని నీమచ్లో 5-6 వేల బస్తాల సరుకు రాబడిపై కొత్త సరుకు రూ. 5150, జి-2 రకం రూ. 5400-5800, చెనై రకం రూ. 5800-6000, మీడియం రూ.5500-5700, యావరేజ్ రూ. 5200-5400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ, లలిత్పూర్ మరియు మధ్య ప్రదేశ్లోని శివపురి ప్రాంతాలలో 20 వేల బస్తాల సరుకు రాబడిపై 4900-5500, 80-90 కౌంట్ వేరుసెనగ గింజలు ఈరోడ్ డెలివరి (జీఎస్టి తో పాటు రూ.7500-8200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళనాడు కోసం రవాణా అయింది.


రాజస్తాన్లోని బికనీర్, మెడతా, జైపూర్, జోధ్పూర్, మహానీపూర్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 20 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై స్థానికంగా రూ. 5500-6200, హెచ్పీఎస్ గింజలు 60-70 కౌంట్ రూ.8500, 60-65 కౌంట్ రూ. 8800, 50-60 కౌంట్ రూ.9200, 40-50 కౌంట్ రూ. 9500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని బళ్లారి, చెల్లకేరి, చిత్రదుర్గ్, గదగ్, యాద్గిర్, రాయిచూర్ ప్రాంతాలలో కలిసి ప్రతి రోజు 50 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 5500-6700, నిమ్ము సరుకు రూ. 4500-5000, చెల్లకేరిలో హెచ్పిఎస్ జలు కొత్త 80-90 కౌంట్ ప్రత్యక్ష ధర రూ. 8900, 90-100. కౌంట్ రూ. 8500, ఎక్స్పోర్ట్ రకం 80-90 కౌంట్ రూ. 9200, 90-100 కౌంట్ రూ. 8700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తమిళనాడులోని త్రిచండ్లో గతవారం 1000 బస్తాల కొత్త వేరుశనగ గింజల రాబడి కాగా, 240 కిలోల బస్తా రూ. 19,600-22,100, ఆలంగుడిలో 5-6 వేల బస్తాల సరుకు రాబడి కాగా, రూ.6000-6700, 50-60 కౌంట్ రూ. 9600, 80-90 కౌంట్ రూ. 9000, చెన్నెలో హెచ్పీఎస్ గింజలు పి-నట్ రూ. 8200, జెఎల్ రకం రూ. 8300, దిండిగల్లో 4-5 బస్తాల రాబడిపై రూ. 6400-6700, వేరుశనగ గింజలు కేరళ డెలివరి 80-90 కౌంట్ (80 కిలోల బస్తా) రూ. 7600, తిరువన్నమలెలో 80-90 కౌంట్ ఎరుపు రకం సరుకు రూ. 8000, తెలుపు రకం 90-100 కౌంట్ రూ.9300 ధరతో వ్యాపారమైంది.


విరుధాచలం, కురుంజిపాడి, తిరుకోవిలూరు, అవలూరుపేట, పెనత్తూరు, విల్లుపురం, జయగోండం తదితర ప్రాంతాలలో దినసరి 15 వేల బస్తాల వేరుశనగ రాబడి కాగా, రూ. 6000-7100, ఈరోడ్లో వేరుశనగ నూనె రూ. 1620, పిండి ప్రతి క్వింటాలు రూ. 5250 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు