కర్ణాటకలోని అరిసెకేరిలో ప్రతి రోజు 500-600 బస్తాల రాగుల రాబడిపై రూ. 1500-1600, చింతామణి, దావణగెరె, హర్పనహళ్లి ప్రాంతాలలో 800-1000 బస్తాలు రూ. 1750-2425, శిమోగాలో 100-150 బస్తాలు ఎరుపు రకం రూ. 2600-3000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళనాడు కోసం రవాణా అవుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, సాలూరు ప్రాంతాలలో గత వారం 4-5 వాహనాల రాగుల అమ్మకంపై లోడింగ్ కండిషన్ రూ. 2100-2150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తాడేపల్లిగూడెం కోసం రవాణా అవుతున్నది.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు