కర్ణాటకలోని అరిసెకేరిలో ప్రతి రోజు 500-600 బస్తాల రాగుల రాబడిపై రూ. 1500-1600, చింతామణి, దావణగెరె, హర్పనహళ్లి ప్రాంతాలలో 800-1000 బస్తాలు రూ. 1750-2425, శిమోగాలో 100-150 బస్తాలు ఎరుపు రకం రూ. 2600-3000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళనాడు కోసం రవాణా అవుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, సాలూరు ప్రాంతాలలో గత వారం 4-5 వాహనాల రాగుల అమ్మకంపై లోడింగ్ కండిషన్ రూ. 2100-2150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తాడేపల్లిగూడెం కోసం రవాణా అవుతున్నది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు