కొనుగోలుదారులు లేని కందిపప్పు

 


 కేంద్ర ప్రభుత్వం కందిపప్పు ధరలను అదుపు చేసేందుకు చేస్తున్న కృషి మరియు అంతర్జాతీయ విపణిలో లెమన్ మరియు లింక్లి కందుల ధర 20 డాలర్ తగ్గి ప్రతి టన్ను 1020 డాలర్ సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినందున ముంబైలో దిగుమతి అయిన లెమన్ కందులు కొత్త సరుకు ధర రూ. 50 తగ్గి రూ. 8000, మొజాంబిక్ గజరి కందులు రూ. 6650, మాలవి ఎర్ర కందులు రూ. 6450-6500, సూడాన్ కందులు రూ. 8250-8450 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మహారాష్ట్ర కందులు చెన్నై డెలివరి రూ. 8850-8950, గుజరాత్ కందులు రూ. 8900-9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. అయితే, ఈసారి ఉత్పత్తి తగ్గినందున ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి దిగజారవని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రాంతపు కందులు కట్ని డెలివరి రూ. 8950-9000, ఇండోర్లో మహారాష్ట్ర కందులు రూ. 8500-8600, కర్ణాటక ఎర్ర కందులు విరుధ్ నగర్ డెలివరి రూ. 8500, తెల్లకందులు రూ. 8700, దిల్లీలో లెమన్ కందులు రూ. 8450, చెన్నై డెలివరి రూ. 8100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

కర్ణాటకలోని గుల్బర్గాలో కందులు రూ. 8000-8400, పప్పు మేలిమి రకం రూ. 11,800, బీదర్, బాల్కీ, యాద్గిర్, సేడెం, అల్మేల్ ప్రాంతాలలో కందులు రూ. 8400-8800, కల్బుర్గ్ ప్రాంతం పప్పు సార్టెక్స్ బెంగళూరు డెలివరి రూ. 1,600-11,800, నాన్-సార్టెక్స్ రూ. 11,200-11,300, మహారాష్ట్ర సరుకు సార్టెక్స్ రూ. 11,500–11,800 మరియు తెలంగాణలోని ఖమ్మంలో మీడియం కందులు కొత్త సరుకు రూ. 7700, పప్పు సార్టెక్స్ కొత్త సరుకు రూ. 11,000, నాన్-సార్టెక్స్ రూ. 10,600, ఆంధ్రప్రదేశ్లోని


కరవైన కందిపప్పు

వినుకొండలో కందులు రూ. 8000, పప్పు సార్టెక్స్ రూ. 11,150, నాన్-సార్టెక్స్ రూ. 10,600, మాచర్ల, పొదిలిలో కందులు రూ. 7800, పప్పు సార్టెక్స్ పాలిష్ రూ. 10,700, ఎండు సరుకు రూ. 11,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని లాతూర్లో 2500-3000 బస్తాల కందుల రాబడిపై 63 -నంబర్ మరియు మారుతి, గులాబి కందులు రూ. 8000–8400, తెల్లకందులు రూ. 8000-8250, సోలాపూర్లో 8-10 వాహనాల సరుకు రాబడిపై గులాబీ కందులు రూ. 7500-8550, జాల్నాలో

తెల్ల కందులు రూ.7500-8400, ఎర్ర కందులు రూ.7500-8000, అమరావతిలో 2500-3000 బస్తాలు రూ.8000-8500, అకోలాలో గులాబీ మరియు గవరాని రూ. 8600-8650, పప్పు మేలిమి రకం నాణ్యమైన సరుకు రూ. 11,000-12,000, మీడియం సరుకు రూ. 11,700–11,800, సవానంబర్ పప్పు రూ. 11,100–11,200 మరియు గుజరాత్లోని రాజ్కోట్, దహోద్ మరియు పరిసర ప్రాంతాలలో కందులు రూ.7500-8100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


Comments

Popular posts from this blog