అకాల వర్షాలతో రంగు వెలిసిన చింతపండు - బెస్ట్ రకాలకు డిమాండ్



ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్లో గత వారం 25-30, పుంగనూరులో 10-15 వాహనాల కొత్త చింతపండు రాబడిపై సిల్వర్ రకం సరుకు రూ. 15,000-20,000, మేలిమి రకం (50-60 శాతం రంగు సరు కు) రూ. 15,000-17,000, మీడియం 12,000–14,000, ఫ్లవర్ నాణ్యమైన సరుకు 7800-8500, మీడియం 6500-7500, యావరేజ్ సరుకు డిస్కెలర్ రూ. 4500-5000, నాణ్యమైన ఫ్లవర్ రూ. 5000-5200 మరియు పుంగనూరులో గింజ సరుకు మహారాష్ట్ర రకం రూ. 3000–3300, లోకల్లో రూ. 2400-2500, చపాతి రూ. 9000-10,500, కళ్యాణ్ దుర్గ్, రాయదుర్గ్లో3-4 వేల బస్తాల రూ. 10,000-12,000, ఫ్లవర్ 6500-7500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


సాలూరు, పార్వ తీపురం ప్రాంతాలలో 9-10 వాహనాలు గింజ సరుకు రూ. 2500-2800, డిస్కెలర్ రూ. 2300-2400, సెమీ-ఫ్లవర్ బెస్ట్ రూ. 8500-9000, మీడియం రూ.6100–6200, యావరేజ్ రూ. 5000 మరియు మహబూబ్నగర్, నవాబ్పేట, షాద్నర్, జనగామా ప్రాంతాలలో రా బడులు తగ్గి వారంలో కేవలం 1-2 వాహనాల రాబడిపై ఫ్లవర్ రూ. 5000-6500 మరియు హైదరాబాద్లో 5-6 వాహనాల సరుకు రాబడి కాగా మహారాష్ట్ర సరుకు రూ. 6500-9000, తెలంగాణలోని సంగారెడ్డి, జహీరాబాద్ సరుకు రూ. 5000-6000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 

కర్ణాటకలోని బెల్గాంవ్లో 3-4 వాహనాలు, చెల్లకేరేలో 15 వాహనాలు, తుంకూరులో 10 వాహనాల సరుకు రాబడిపై మేలిమి రకం నాణ్యమైన సరుకు రూ. 13,000–15,000, మీడియం రూ. 10,000-12,000, ఫ్లవర్ రూ. 5000-6000 ధరతో వ్యాపారమైంది.

మహారాష్ట్రలోని బార్షీ, అహ్మద్ నగర్ ప్రాంతాలలో వర్షాల కారణంగా రాబ డులు తగ్గి కేవలం 1500-1600 బస్తాల రాబడి కాగా, అహ్మద్ నగర్ లో ఫ్లవర్ రకం సరుకు (60-70 శాతం) రూ.7500-8200, మీడియం రూ.7000-7500, బారీ లో నాణ్యమైన సరుకు రూ. 6500-6700, మీడియం రూ. 6000-6400, యావరేజ్ రూ. 5800-6000 ధరతో వ్యాపారమెంది. జార్ఖండ్ లోని రాంచీ, లోహార్దాగా, తదితర ప్రాంతాలలో వారంలో 3-4 వాహనాల రాబడి కాగా, గింజ సరుకు బిల్జీ రూ. 1700-2100 (50-60 శాతం రంగు సరుకు) ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది.

మధ్య ప్రదేశ్లోని ఇండోర్లో ప్రతిరోజు కేవలం 200-300 వాహనాల సరుకు అమ్మకంపై ఓం బ్రాండ్ రూ. 9500, ఫ్లవర్ మీడియం రూ. 6500-7500, గింజ సరుకు రూ. 3000-3500, ఉన్హేల్, తరానాలో వారం రోజులుగా కురు స్తున్న వర్షాల వలన కేవలం 2 వేల బస్తాల కొత్త చింతపడు రాబడిపై ఎండు సరుకు (40- 50 శాతం రంగు సరుకు) రూ. 2400-2800 మరియు తరానినాలో ప్రతిరోజు 200-300 బస్తాల రాబడిపై రూ. 2500-2600 ధరతో వ్యాపారమె పంజాబ్, నడియాడ్ ప్రాంతాల కోసం రవాణా అయింది.ఛత్తీస్గడ్ లోని అన్ని మార్కెట్లలో దినసరి 7-8 వాహ నాల రాబడిపై గింజ సరుకు (డిస్కెలర్) రూ. 2000 ధర తో బిల్టికట్ వ్యాపారమెంది.

తమిళనాడులోని కృష్ణగిరిలో 3-4 వాహనాల కొత్త సరుకు రాబడి పై చపాతీ గింజ సరుకు రూ. 3200–3300, మీడియం 2400-2800, మహారాష్ట్ర సరుకు 4300-4400, పాపరంపట్టిలో 15-20, సేలంలో 8-10, దిండిగల్లో ప్రతిరోజు 3-4 వాహనాలు, కంబం, ధర్మపురిలో 4-5 వాహనాల చొప్పున సరుకు రాబడి కాగా ఫ్లవర్ మేలిమి రకం రూ. 10,000-12,000, చపాతీ స్థానికంగా రూ. 8500, మహారాష్ట్ర చపాతీ రూ. 9000, ఫ్లవర్ రూ. 7000-8500, నాణ్యమైన గింజ సరుకు స్థానికంగా రూ. 2400-2800, మహారాష్ట్ర సరుకు రూ. 2900–3000, నలగ్గొట్టని చింతపండు రూ.2400, లోకల్ రూ. 2050 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

మహారాష్ట్రలోని బార్షీలో ప్రతి రోజు 1500-1600 బస్తాల కొత్త చింతపండు రాబడిపై ఫ్లవర్ రంగు సరుకు (60-70 శాతం రంగు సరుకు) రూ. 7500-8200, మీడియం రూ. 7000-7500, యావరేజ్ సరుకు 6500-6700, మీడియం రూ.60000-6400, యావరేజ్ సరుకు 5800-6000, అహ్మద్ నగర్1500-1600 బస్తాలు నాణ్యమైన సరుకు (60-70 శాతం రంగు సరుకు) రూ.7500-8200, మీడియం 7000-7500, యావరేజ్ సరుకు 6000-6500 ధరతో వ్యాపారమైంది.

చింతగింజలు : ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్లో 7-8 వాహనాలు, పుంగనూరులో 4-5 వాహనాలు చింతగింజల రాబడి కాగా ప్రతి క్వింటాలు రూ. 1700, పప్పు సూరత్ డెలివరి రూ. 3000, బార్షీ డెలివరి రూ. 2900, చింతగింజల పొడి రూ. 4500, సాలూరులో 3-4 వాహనాల చింతగింజలు రూ. 1450-1500, పుంగనూరు డెలివరి రూ. 1720 మరియు తెలంగాణలోని మహబూబ్ నగర్, జడ్చర్ల, శాద్నగర్లో 1-2 వాహనాలు రూ. 1600-1625 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

మహారాష్ట్రలోని బార్షీలో 3–4 వాహనాల చింతగింజలు రూ. 1700, కర్ణాటక సరుకు రూ. 1775, అహ్మద్ నగర్ 3-4 వాహనాలు చింతగింజలు స్థానికంగా రూ. 1675, కర్ణాటకలోని తుంకూరులో 8-10, చెల్లకేరిలో 4-5, బెల్గాంలో 2-3 వాహనాలు రూ. 1650 మరియు తమిళనాడులోని పాపరంపట్టి, క్రిష్ణగిరిలో 10-12 వాహనాలు రూ. 1600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog