అడుగంటుతున్న బెల్లం నిల్వలు దూసుకుతున్న ధరలు

 

దేశంలోని బెల్లం ఉత్పాదక రాష్ట్రాలలో సరుకు తయారీ ప్రక్రియ నత్తనడకేసినందున నిల్వలు గత ఏడాదితో పోలిస్తే క్షీణించాయి. పంచదార ధరలు ఎగబాకుతున్నందున బెల్లం ధరలకు కూడా మద్దతు లభిస్తున్నది. శుభ ముహూర్తాలు ప్రారంభమైనందున బెల్లం అమ్మకాలు జోరందుకున్నాయి.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో గత వారం కురిసిన వర్షాలు, కూలీల కొరత మరియు చెరకు కోతలు ముగిసినందున ఉత్పాదక కేంద్రాలకు బెల్లం రాబడులు తగ్గాయి. వినియోగ కేంద్రాల వద్ద అమ్మకాలు జోరందుకున్నందున ఉత్తరప్రదేశ్లో ధర ప్రతి క్వింటాలుకు రూ. 200-250, ఇతర రాష్ట్రాలలో రూ. 150-200 ఎగబాకింది.

ఉత్తరప్రదేశ్ శీతల గిడ్డంగులలో బెల్లం నిల్వలు గత వారంతో పోలిస్తే తరిగిపోతున్న నిల్వలు మరియు హాపూర్లో సరుకు రాబడులు మరో వారం రోజులలో ముగియనున్నాయి.

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ శీతల గిడ్డంగులలో మే 1 వరకు బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే 15,44, 705 నుండి తగ్గి 3,21,354 తగ్గి 12,23,351 బస్తాలకు పరిమితమయ్యాయి. ఇందులో చాకూబెల్లం నిల్వలు 9,18,846 నుండి తగ్గి 6,52,663, రాబిటన్ 2,67,855 నుండి 2,61,206, చదరాలు 1,19,637 నుండి 87,826, పాపి 1,71,002 నుండి 1,47,949, కురుపా 28,635 నుండి 27,528 కు తగ్గగా, రస్కట్ 36,820 నుండి పెరిగి 44,626, లడ్డు బెల్లం 751 నుండి 1290 బస్తాలకు చేరాయి. ముజఫర్ నగర్లో గత వారం 3-4 వేల బస్తాల సరుకు రాబడి కాగా రూ. 200-250 పెరిగి చాకూ బెల్లం ప్రతి 40 కిలోలు రూ. 1400-1745, లడ్డు బెల్లం రూ. 1590-1617, పొడి బెల్లం రూ. 1550-1560 మరియు హాపూర్లో 5-6 వాహనాల కొత్త బెల్లం రాబడిపై రూ. 1435-1455 ప్రతి 40 కిలోల ధరతో వ్యాపారమైంది.

ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి మార్కెట్లో గత వారం 2-3 వేల దిమ్మల కొత్త బెల్లం రాబడిపై గులాబి రూ. 4400-4500, మీడియం రూ. 4200-4300, నలుపు రకం రూ. 3950-4000, చిత్తూరులో 8-10 వాహనాల కొత్త బెల్లం సురభి రకం రూ. 500, సూపర్-ఫెన్ రూ.4800 , సాట్నా రకం రూ. 4400, నలుపు రకం రూ. 4100-4300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

మహారాష్ట్రలోని లాతూర్లో గత వారం 10-12 వేల దిమ్మల బెల్లం రాబడిపై సురభి నాణ్యమైన సరుకు రూ. 3700-3800, మీడియం రూ. 3500-3575, సోలాపూర్ 4-5 వేల దిమ్మలు సురభి నాణ్యమైన సరుకు రూ. 3950–4000, మీడియం రూ. 3550-3600, సాంగ్లీలో 10-12 వాహనాలు శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై సురభి రూ. 3600-3700, గుజరాత్ రకం రూ. 3750-3800, ముంబై రకం రూ. 3850-3900, నాణ్యమైన సరుకు రూ. 4050-4100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని మాండ్యా మార్కెట్లో గత వారం 8-10 వాహనాల సరకు రాబడిపై ఎరుపు రకం రూ. 3600, సింగల్ ఫిల్టర్ రూ. 3900, డబుల్ ఫిల్టర్ రూ. 4200, చద రాలు రూ. 4550-4600, మహాలింగపూర్లో 4-5 వాహనాలు సురభి రకం రూ. 3600-3700, ఎరుపు రకం రూ. 3400-3600, గుజరాత్ రకం రూ. 3750, చదరాలు రూ. 3750-3800, శిమోగాలో 18-20 వాహనాలు దేశీ బెల్లం రూ. 3750-3800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

తమిళనాడులోని సేలం మార్కెట్లో వారంలో 10 వేల బస్తాల బెల్లం రాబడిపై తెలుపు రకం రూ. 1300-1320, పసుపు వర్ణం రూ. 1280-1300, ఎరుపు రకం సరుకు రూ. 1270-1290, పిలికెలిపాలయంలో 6-7 వేల బస్తాల రాబ డిపె రూ. 1240–1260, పసుపు రకం రూ. 1220-1240, ఎరుపు రకం సరుకు రూ. 1200-1220, చిత్తోడ్లో 6-7 వేల బస్తాలు తెలుపు రకం రూ. 1250-1270, పచ్చ బెల్లం రూ. 1230-1250, ఎరుపు రకం రూ. 1220–1240, పౌడర్ రకం రూ. 1250-1300 మరియు కౌందప్పాడిలో వేల బస్తాలు పౌడర్ రకం రూ. 1250-1320 ధరతో వ్యాపారమెంది.

Comments

Popular posts from this blog