పెరిగిన పసుపు మార్కెట్ మరియు వాయిదా ధరలు
గతవారం ఆంధ్ర, మహారాష్ట్ర సహా ఇతర కొన్ని ఉత్పాదక రాష్ట్రాలలో వర్షాల వలన రెత్తుల సరుకు రాబడులు తగ్గడం మరియు రాబోవు సాగు కోసం అల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున మార్కెట్తో పాటు ౬ వాయిదా ధరలు పెరిగాయి. ఎన్సిడిఇఎక్స్ మే వాయిదా రూ. 6730 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ. 676 పెరిగి రూ. 7406, జూన్ వాయిదా రూ. 610 పెరిగి రూ. 7506తో ముగిసింది. దీనితో మార్కెట్ ధరలు రూ. 500-600 మేర పెరిగాయి.
నిజామాబాద్లో గతవారం కేవలం 10 వేల బస్తాల రాబడిపై కొమ్ము రూ. 5500- 6800, గట్టా రూ. 4800-5800, పాలిష్ కొమ్ము రూ. 7400- 7500, గట్టా రూ. 6400-6500 మరియు మెట్పల్లిలో 1500-2000 బస్తాల రాబడిపై కొమ్ము రూ. 3600-5600, గట్టా రూ.3500-5200, కేసముద్రంలో 600-700 బస్తాల రాబడిపై కొమ్ము మరియు గట్టా రూ. 4500-5600, దుగ్గిరాలలో 4-5 వేల బస్తాల రాబడిపై కొమ్ము మరియు గట్టా రూ. 4800-5400 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమయింది.
మహారాష్ట్రలోని హింగోలిలో మంగళ మరియు బుధవారాలలో కలిసి 7-8 వేల బస్తాల రాబడిపై రూ. 5500–6200, గట్టా రూ. 5200-5700, సాంగ్లీలో 10-12 వేల బస్తాల రాబడిపై రాజాపురి రూ. 7000-7500, మీడియం రూ. 6500 - 6700, దేశీ కడప రూ. 6500-7000, నాణ్యమైన పౌడర్ రకం రూ. 12500–13400, మీడియం రూ. 8500-9000 మరియు నాందేడ్లో 8-10 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన కొమ్ము రూ. 6500-7500, మీడియం రూ. 5800-6200, నాణ్యమెన గట్టా రూ. 6000-6500, మీడియం రూ. 5500-5700 మరియు బస్మత్గానగర్లో 3-4 వేల బస్తాల రాబడిపై కొమ్ము రూ. 6000-7000, గట్టా రూ.6000-6100 ధరతో వ్యాపారమయింది.
తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో గతవారం 14-15 వేల బస్తాల రాబడిపై కొమ్ము రూ.5399-6491, గట్టా రూ. 4959-5967, పెరుందరె, గోబి చెట్టి పాలయంలో 800-1000 బస్తాల రాబడిపె కొమ్ము రూ. 4911-6154, గట్టా రూ. 4500-5659 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు