బొబ్బర్లు : ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని పొదిలిలో ప్రతి రోజు 5 క్వింటడాళ్లు, గురుమిట్కల్లో 1000–1500 బస్తాల బొబ్బర్ల రాబడిపై రూ. 4550 ప్రతి క్వింటాలు ధరతో వ్యారమై మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది. రాయచోటిలో 4-5 వాహనాల బొబ్బర్ల రాబడిపై నలుపు సరుకు రూ. 5500, తెలుపు రూ. 4450, కర్ణాటకలోని మైసూరు, హగరిబొమ్మనహళ్లి, బళ్లారి ప్రాంతాలలో ప్రతి రోజు 1000 బస్తాలు గులాబీ రకం రూ. 6000-6800, ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ఉలువలు : కర్ణాటకలోని మైసూరులో ప్రతి రోజు 8 వాహనాల ఉలువల రాబడిపై 200 బస్తాలు రూ. 3400–3600 మరియు ఆంధ్రప్రదేశ్లోని 00, బళ్లారిలో . 3700, రాయచోటిలో వారంలో 100 బస్తాలు రూ. 3700 మరియు 300 బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై ఒంగోలు డెలివరి రూ. 3500 విజయనగరంలో 3 వాహనాల సరుకు అమ్మకంపై రూ. 4000-4500, నలుపు సరుకు రూ. 6000-6500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తాడేపల్లిగూడెం కోసం రవాణా అవుతున్నది.
రాగులు : తెలంగాణలోని మహబూబ్ నగర్ లో ప్రతి రోజు 2 వాహనాల రాగులు రాబడిపై రూ. 3000-3500, విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాలలో నిల్వ అయిన సరుకు తాడేపల్లిగూడెం డెలివరి రూ.3500 - 3600 ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు