కొత్త ధనియాలు ప్రారంభం - ధరలు స్థిరం

 


02-02-2022

గుజరాత్ వ్యవసాయ డెరెక్టరేట్ వారి మొదటి ముందస్తు అంచనా ప్రకారం ప్రస్తుత రబీ సీజన్లో రాష్ట్రంలో ధనియాల ఉత్పత్తి 2.11 ల.ట. ఉండే అంచనా కలదు. దేశంలోని ప్రముఖ ధనియాల ఉత్పాదక కేంద్రాలలో వంట కోతలతో పాటు స్వల్పంగా కొత్త సరుకు రాబడి ప్రారంభం కావడంతో మరియు వినియోగ కేంద్రాలలో డిమాండ్ తక్కువగా ఉండడంతో గతవారం ధరలు రూ. 200-300 ప్రతిక్వింటాలుకు తగ్గాయి. అయితే, 15, జనవరి తరువాత ఎండు సరుకు రాబడుల సమయంలో దక్షిణ భారత వ్యాపారులు కొనుగోళ్ల వలన మార్కెట్ కు మద్దతు లభించగలదని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. 




రాజస్తాన్లోని రాంగంజ్ మండీలో మంగళవారం 50 బస్తాల కొత్త ధనియాల రాబడిపై 40-45 శాతం నిమ్ము సరుకు రూ. 8200, మధ్యప్రదేశ్లోని నిమచ్లో సోమవారం 1 బస్తా కొత్త సరుకు రాబడిపై నాణ్యమైన ఎండు సరుకు ఆకుపచ్చ రూ. 12500, జావ్రాలో 15–20 బస్తాల రాబడిపై 25-30 శాతం నిమ్ము సరుకు రూ.5800 -6400, గుజరాత్లోని గోండల్లో గురువారం 50 బస్తాలు మరియు రాజ్కోట్లో 70-80 బస్తాల కొత్తసరుకు రాబడిపై రూ. 7500-8750 ధరతో వ్యాపారమయింది.


ఎన్సీడిఇఎక్స్లో సోమవారం ఏప్రిల్ వాయిదా రూ. 10180 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ. 2 పెరిగి రూ. 10182, మే వాయిదా రూ.62 తగ్గి రూ.10258 తో ముగిసింది.8700-8800, బారన్ 8-10 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. రూ. 8000-8500, ఈగల్ రూ.8500-8600, ఈగల్ రూ. 8700-8800, భవానీమండీ, ఛబ్జా, ఇటావా ప్రాంతాల మార్కెట్లలో కలిసి 5-6 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 8300 -8500, ఈగల్ రూ. 8700 -8900 ధరతో వ్యాపారమయింది.


మధ్య ప్రదేశ్లోని గునాలో గతవారం 7-8 వేల బస్తాల పాత సరుకు రాబడిపై బాదామీ 8600 – 8700, నాణ్యమైన సరుకు రూ. 8900-9000, స్కూటర్ రూ. 9200 -9300 మరియు కుంభరాజ్లో 2000 బస్తాల రాబడిపై బాదామీ రూ. 8500 -8600, ఈగల్ రూ.8800-9000, 1 - నిమచ్లో 6-7 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 8200-8400, ఈగల్ రూ.70-80, స్కూటర్ రూ.ఈగల్ 900 - 9400 ధరతో వ్యాపార మయింది. రాజస్తాన్లోని రాంగంజ్ మండీలో గతవారం 20-22 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 8100-800, ఈగల్ రూ.8600-8700, స్కూటర్ రూ. 9000–9200, ధనియాల పప్పు బాదామీ రూ. 8600, ఈగల్ రూ. 9000 ప్రతిక్వింటాలు లోకల్ లూజు మరియు ప్రతి 40 కిలోలు లారీ బిల్టీ బాదామీ రూ. 3800, ఈగల్ రూ. 3900 మరియు కోటాలో 4-5 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 8400-8500,


గుజరాత్లోని గోండల్లో దినసరి 2000-2200 బస్తాల రాబడిపై నాణ్యమైన రూ. 8900-9000, మీడియం రూ. 8500-8700, సన్నరకం రూ. 10000-10300, రాజ్కోట్లో గతవారం 4-5 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 8000 -8250, ఈగల్ రూ.8500 -8750, స్కూటర్ రూ. 9000-9150, జూనాఘడ్లో క్లీన్ ఈగల్ రూ. 9500, స్కూటర రూ. 10000 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమయింది. ఒంగోలులో బాదామీ రూ. 4350, ఈగల్ రూ. 4400, స్కూటర్ రూ. 4475 మరియు కోల్డ్ స్టోరేజీలలో నిల్వ అయిన సరుకు రూ.4250 ప్రతి 40 కిలోల ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు