ఉత్తరప్రదేశ్లోని ఉరైలో 3 వేల బస్తాల ఆకుపచ్చ బఠాణీల రాబడిపై రూ. 4500-4950 మరియు 2 వేల బస్తాల తెల్ల బఠాణీల రాబడిపై రూ. 4500-4900, ఝాన్సీలో 4 వేల బస్తాల రాబడి కాగా, రూ. 4500-4700, మహోబాలో ప్రతి రోజు5-6 వేల బస్తాల కొత్త బఠానీల రాబడిపై రూ. 5000-5450 ధరతో వ్యాపారమైంది.
మరియు కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ సరుకు రూ. 4875-5075, మధ్య ప్రదేశ్ సరుకు రూ. 4775-4975 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఈ ఏడాది శనగలు ధరలు క్షీణిచడం మరియు బఠాణీల ఉత్పత్తి పెరగడం వలన ధరలు దిగజారుతున్నాయి. తద్వారా ప్రస్తుతం రైతులు తమ సరుకును నెమ్మదిగా విక్రయిస్తున్నారు.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు