ఈ ఏడాది గుజరాత్లో యాసంగి పెసర పంట విస్తీర్ణం గతఏడాది మాదిరిగా ఉన్నప్పటికీ పంట దిగుబడి తగ్గింది. మరియు స్థానిక గిరాకీ వలన రాజకోట్లో దినసరి 150-200 బస్తాల రాబడిపై సాద రూ.6555-6900, చమ్కీరూ. 7025-7245 లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది. ఆంధ్ర ప్రాంతపు నాణ్యమైన సన్నరకం చమ్కీ పెసలు చెన్నై డెలివరీ రూ. 100-700 ధరతో వ్యాపారమెంది.
తమిళనాడులోని తంజావూరు, చిదంబరం మయావరం, విల్లూపురం, పన్ రొట్టి, దిండివనం ప్రాంతాల మార్కెట్లలలో కలిసి దినసరి 1500-2000 బస్తాల కొత్త సరుకు రాబడి పై చెన్నై డెలివరీ రూ. 6900-6950, దిగుమతి అయిన పెడెశ్వర్ పప్పు క్వాలిటీ పెసలు రూ. 6950-7000 ధరతో వ్యాపారమైంది.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు