Posts

గుజరాత్లో తగ్గిన పెసరపంట దిగుబడి

Image
  ఈ ఏడాది గుజరాత్లో యాసంగి పెసర పంట విస్తీర్ణం గతఏడాది మాదిరిగా ఉన్నప్పటికీ పంట దిగుబడి తగ్గింది. మరియు స్థానిక గిరాకీ వలన రాజకోట్లో దినసరి 150-200 బస్తాల రాబడిపై సాద రూ.6555-6900, చమ్కీరూ. 7025-7245 లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది. ఆంధ్ర ప్రాంతపు నాణ్యమైన సన్నరకం చమ్కీ పెసలు చెన్నై డెలివరీ రూ. 100-700 ధరతో వ్యాపారమెంది. 

పప్పుకు గిరాకీ రావడంతో మినుములు పటిష్ఠం

Image
  గత వారం దక్షిణ భారత పప్పు మిల్లర్ల ద్వారా కొనుగోలు పెరగడంతో దిగుమతి అయిన సరుకు రూ. 150-200 పెరగడంతో దేశీ సరుకు రూ. 50-75 పెరిగింది. మహారాష్ట్రలో సాంగ్లీ లో గతవారం 2లారీల సరుకు రాబడిపై చెన్నై డెలివరీ రూ. 7400-7450, తమిళనాడులోని విల్లుపురం, మయవరం, పన్ ట్టి, చిదంబరం, తంజావురు తదితర మార్కెట్లలలో కలిసి దినసరి 2-3 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై విల్లుపురం ప్రాతం సరుకు చెన్నై డెలివరీ రూ.7000 - 7050, తంజావూరు సరుకు రూ. 6950, రాయలసీమ సరుకు రూ.6800-6900, క్రిష్ణ జిల్లా కొత్త పాలీష్ రూ. 7050-7100 ధరతో వ్యాపారమైంది.

వేరుశనగ రాబడులతో ధరలలో మందకొడి

Image
  తెలంగాణలోని గద్వాల, మహబూబ్ నగర్, జడ్చర్ల, నాగర్ కర్నూలు, తిరుమలగిరి, అచ్చంపేట, సూర్యపేట, వరంగల్, కేసముద్రం ప్రాంతాలలో ప్రతి రోజు 20 వేల బస్తాల సరుకు రాబపడిపై రూ.4500-6410, గద్వాల లో హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ చెన్నై డెలివరి రూ. 9460,మహబూబ్ నగర్ హెచ్పిఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 9400, 70-80 కౌంట్ రూ.9500, 60-70 కౌంట్ రూ. 9700, చెన్నై డెలివరి 50-60 కౌంట్ రూ. 9900, ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

పసుపుకు ఉజ్వల భవిష్యత్తు

Image
  వ్యాపారస్తుల కథనం ప్రకారం గత గురువారం నుండి నిజామాబాద్, వరంగల్ మొదలగు మార్కెట్లు మూసిఉండడంతో సోమవారం భారీగా సరుకు రాబడి అయ్యే అవకాశం కలదు. ఏప్రిల్ వాయిదా దాదాపు సమాప్తమయింది. దీనితో పసుపు చివరి మందకొడి సోమవారం నుండి బుధవారం వరకు ఉండగలదు దీని తరువాత ధరలు హెచ్చుముఖం పట్టే అవకాశం కలదు. ఎందుకనగా స్పెక్యులేటర్స్ మే-జూన్ వాయిదా కొనుగోలు చేయడంపై దృష్టిసారిస్తున్నారు. సోమవారం 12 గం.ల తరువాత మార్కెట్ మరియు వాయిదా ధరల పరిస్థితిపై ధరలు తగ్గితే, కొనుగోలు చేయడం భవిష్యత్తులో లాభదాయకంగా ఉండగలదు. ఎందుకనగా పసుపు ఏప్రిల్ వాయిదా సెటిల్మెంట్తో పాటు ఆహార ధాన్యాలు మరియు అపరాల వ్యాపారులు కూడా ఈ ఏడాది పసుపు, ధనియాలు, జీలకర్రలపై మొగ్గుచూపుతున్నారు. అంతేకాకుండా రైతులు కూడా ప్రస్తుత ధరలను పరిగణనలోకి తీసుకుని పంట కోతలతో పాటు విత్తనాలు ఎక్కువగా నిల్వ చేసే అవకాశం కలదు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే 2023లో సమృద్ధిగా ఉత్పత్తికి అవకాశం కలదు.

చురుకుగా చింతపండు స్టాకిస్టులు

Image
   లభించిన సమాచారం ప్రకారం మహారాష్ట్రలోని ఉత్పాదక కేంద్రాలలో వేసవితాపంతో సరుకు రంగు తగ్గింది. అయితే ఈ ఏడాది మహారాష్ట్ర లో ధరలు తక్కువగా ఉండడంతో 40 శాతం సరుకు మాత్రమే శీతల గిడ్డంగులలో నిల్వలు జరిగాయి. రాబోవు పదిహేను రోజులలో రాబడులు సమాప్తం అయ్యే అవకాశం కలదు. ఈ ఏడాది చింతపండు నిల్వ చేసేవారికి లాభం చేకూరే అవకాశం కలదు. ఎందుకనగా గత ఏడాది సరుకు రూ. 10,000 ధరలేదా అంతకంటే ధర అధికంగా ఉంది. అయితే ఈ ఏడాది రూ. 7,500- 8,500 ధరతో నిల్వలు చేసిన సరుకు రూ. 10,000 ధరతో సులభంగా అమ్మకం అయ్యే అవకాశం కలదు.

పెరిగిన జీలకర్ర రాబడులు

Image
  గతవారం ఉత్పాదక కేంద్రాలలో రాబడులు పెరగడంతో పాటు ఎన్సీడిఇఎక్స్ వద్ద సోమవారం జీలకర్ర ఏప్రిల్ వాయిదా రూ.22,330 తో ప్రారంభమై బుధవారం నాటికి రూ. 200 క్షీణించి రూ. 22,130, మే వాయిదా రూ. 160 పతనమై రూ. 22,340 వద్ద ముగిసింది. అయితే స్థానిక మార్కెట్లలో ధర రూ. 250-300 వృద్ధిచెందింది.

తగ్గిన ధనియాల రాబడులు

Image
  గత వారం గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మార్కెట్లలో రాబడులు తగ్గినందున చిన్న మరియు మధ్య తరగతి రైతుల సరుకు అమ్మకం అయినట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కేవలం పెద్ద రైతుల వద్ద సరుకు నిల్వలు ఉన్నాయి. మర ఆడించే యూనిట్లు మరియు స్టాకిస్టులు సరుకు కొనుగోలు చేస్తున్నందున గత వారం మార్కెట్ ధరలు రూ. 200-300 పెరగగా, ఏప్రిల్ వాయిదా రూ. 148 వృద్ధిచెందింది. దీనితో వాయిదా డెలివరి చేసేవారి గట్టిపట్టు ఉన్నట్లు అంచనా వేయబడుతున్నది. వచ్చేవారం రాబడులు తగ్గితే, ధరలు నిరవధికంగా పెరిగే అవకాశం కలదు.